భక్తులకు ఉచిత నీటి సరఫరా
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, సిరసనగండ్ల రాముల వారి కళ్యాణ్ ఉత్సవంలో బుధవారం పాల్గొన్న భక్తులకు ఒక ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు ఉచితంగా త్రాగు నీరు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యజమానులు సూదిని శేఖర్ రెడ్డి, సూదిని రాజేందర్ రెడ్డి, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.