మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ వంటగదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.