వరద బాధితుల సహాయార్థం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు విరాళాలు సేకరించడం పట్ల వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. విద్యార్థులు సేకరించిన రూ. 6, 21, 100 లక్షల విరాళాలను సోమవారం సీఎం సహాయనిధికి అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య, తదితరులను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.