

మహా కుంభమేళాకు ఒకే రోజు 6 కోట్లకుపైగా భక్తులు (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. మౌని అమావాస్య ప్రభావంతో భక్తుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. ఇవాళ మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 8 కోట్లు దాటవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.