మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు
మిషన్ భగీరథ పథకానికి కడెం ప్రాజెక్టు నుండి 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, బుధవారం ఆ ప్రాజెక్టులో 6 73 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు లేక ప్రాజెక్టులోకి వరద నీరు రావడం లేదు. అయితే ప్రాజెక్టు నుండి 91 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉండేదని అధికారులు తెలిపారు.