జంతువులు, పక్షులకు తిప్పలే
ఖానాపూర్ నియోజకవర్గంలో నమోదవుతున్న ఎండల తీవ్రత మనుషులతో పాటు జంతువులకు, పక్షులకు కూడా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివార మధ్యాహ్నం మూడు గంటలకు 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అదే సమయంలో ఎండల తీవ్రతకు జంతువులు పక్షులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దాహాన్ని తీర్చుకునేందుకు అవి సమీప బావులు, చెరువులు, వాగులు, నీటి తావులకు వచ్చి నీటిని తాగి దాహార్తిని తీర్చుకుంటున్నాయి.