కోలూర్ గ్రామంలో ఇంటి పన్నులు వసూలు
నిర్మల్ జిల్లా తానూర్ మండల పరిధిలోని అన్ని గ్రామంలో 100% శాతం ఇంటి పనులను వసూలు చేయాలని ఎంపీడీవో మోహన్ సింగ్ కోరడంతో శనివారం మండలంలోని కోలూర్ గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేశారు. అనంతరం ఎంపిడిఓ ఇంటి పన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రటరీ సహేందర్, కార్బారీ, తదితరులు పాల్గొన్నారు.