రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
రైతు రుణమాఫీపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శనివారం కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని, అయినప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం తాము పని చేస్తున్నామన్నారు.