ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత పాటించాలి
35వ రోడ్డు భద్రత మసోత్సవాలలో భాగంగా శుక్రవారం కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎల్ అండ్ టి సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ జకీర్ హుసేన్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డు దాటుతున్న సమయంలో జీబ్రా క్రాసింగ్ వద్దనే వెళ్ళాలి, అలాగే ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.