

జహీరాబాద్: అమిత్ షా ను మంత్రివర్గం నుంచి భర్తలకు చేయాలి
కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహమ్మద్ అత్తర్ అహ్మద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానపరిచేలా కేంద్రమంత్రి మాట్లాడడం సరికాదని చెప్పారు. దళిత సంఘాల ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అమిత్ షా పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.