

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ (వీడియో)
AP: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం ఎడ్వర్డ్ పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కారుకు దారిచ్చే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు గొడ్డళ్లు, ఇనుప రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైసీపీ నరసరావుపేట ఇన్ఛార్జ్ గోపిరెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. రొంపిచర్ల పోలీసులకు ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి.