అయోధ్య రామాలయంలో భద్రత పెంపు
ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య రామాలయంలో జరిగే తొలి రామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. రద్దీ నిర్వహణ, దర్శనం కోసం పోలీసులు ప్రణాళికలు రూపొందించారన్నారు.