Apr 18, 2024, 01:04 IST/గజ్వేల్
గజ్వేల్
అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం
Apr 18, 2024, 01:04 IST
శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలోని రామలయం ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణం సందర్భంగా రాములోరి ఎదుర్కోలు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో గ్రామవీధుల్లో నిర్వహించారు. భక్తుల సమక్షంలో వేద బ్రాహ్మణులు వేద మంత్రలతో కళ్యాణ క్రతువు నిర్వహించారు. కల్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు.