అత్యవసరంగా జమ చేయాల్సిన స్థితి లేదు: ఈసీ
ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర సీఎస్ ఇచ్చిన వివరణపై ఈసీ స్పందించింది. "జనవరి, మార్చి నెలల మధ్య ఏపీ ఆర్థిక పరిస్థితి బాగున్నా DBT పథకాలకు నిధులు అందుబాటులో ఉంచలేదు. నిధులను దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచడం సరికాదు. మే నెలలో ఎప్పుడూ DBT పథకాలకు నిధులు జమ చేయదు. పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే జమ చేయాల్సిన అత్యవసర స్థితి ఏమీ లేదు." అని ఈసీ పేర్కొంది.