నేటి నుంచి కాళేశ్వరంపై మూడో విడత న్యాయ విచారణ

84చూసినవారు
నేటి నుంచి కాళేశ్వరంపై మూడో విడత న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై శుక్రవారం నుంచి మూడో విడత న్యాయ విచారణ ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టీస్ పీసీ ఘోష్ గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులు కమిషన్‌తో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆయన సందర్శిస్తారని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you