Mar 30, 2024, 14:03 IST/పాలకుర్తి
పాలకుర్తి
భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
Mar 30, 2024, 14:03 IST
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండలంలోని పలు గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నియోజకవర్గ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సిరెడ్డి వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలావుండగా ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ దేవరుప్పుల పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.