వరుస ఇండ్లల్లో చోరీ చేసిన దొంగలు
జనగాం నియోజకవర్గం కొమురవెల్లి మండలం గౌరయపల్లి గ్రామంలో ఒకే రోజు ఆరు ఇండ్లల్లో వరుస చోరీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.