ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్న ప్రజలు

74చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని దొడ్ల- మల్యాల మధ్య ఇటీవల వరదలకు తాత్కాలిక మట్టిరోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై రూ. 35లక్షల నిధులతో ఐరన్ వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఆ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. ఆదమరిస్తే ప్రాణాలు ప్రమాదమని అంటున్నారు.