![](https://media.getlokalapp.com/cache/43/43/4343815faca69a13ad002388c8fd61ed.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి పిల్ల
మత్స్యకారుల వలకు ఓ మొసలిపిల్ల చిక్కిన ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో రాచపల్లి కెనాల్ లో కొత్త నీరు చేరింది. దీంతో చేపల వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారుల వలకు మొసలి పిల్ల చిక్కింది. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో. మొసలి పిల్లను స్వాధీనం చేసుకుని గోదావరిలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు.