ఏటూరునాగారంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి దినోత్సవం వేడుకలను రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చిన్న హాజరై మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, రచయిత అని, సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని కొనియాడారు.