కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
జనగామ జిల్లా నర్మెట్ట మండలం పేదల సంక్షేమం, మహిళా సాధికారత, భద్రత, అంతర్గత బాధ్యత, సాంస్కృతిక పునరుద్ధరణ, విదేశాల్లో దేశ గౌరవాన్ని పెంపొందించడం వంటి రంగాల్లో అసాధారణ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బిజెపితొనే సాధ్యపడిందని "గావ్ ఛలో బస్తీ ఛలో అభియాన్" నర్మెట్ట మండల కో కన్వీనర్ బొల్లం అవినాష్ అన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.