Jul 19, 2024, 14:07 IST/పాలకుర్తి
పాలకుర్తి
ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మెల్యే
Jul 19, 2024, 14:07 IST
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కొడకండ్ల మండలం రేగుల గ్రామంలో పర్యటించారు. శుక్రవారం ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించడంతో పాటు గ్రామంలోని పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుక్కున్న అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.