ఈద్గాలను సందర్శించిన సిపి
రంజాన్ పర్వదిన వేళ ముస్లిం సోదరులు ప్రార్ధనలు నిర్వహించుకునే మాట్టేవాడ, హనుమకొండ బొక్కల గడ్డ ఈద్గాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్థానిక పోలీస్ అధికారులతో కల్సి బుధవారం ఈద్గాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రార్ధన సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్ధనలు జరుపుకునే విధంగా తగు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.