
వరంగల్: మనువాదం మహా ప్రమాదం:రైతు సంఘం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతి నీ దగ్ధం చేశారు. ఈరోజుతో 97 సంవత్సరాలు గడిచిపోయాయనీ ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు హనుమకొండ రామ్ నగర్లోని కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగం, మనుస్మృతి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ సమాజంలోని అధిక సంఖ్యాకులకు హక్కులు లేకుండా చేసిన మనుస్మృతిని దగ్ధం చేశారని అన్నారు.