కలుషిత ఆహారం తిని 14మందికి అస్వస్థత

AP: అల్లూరి జిల్లా పాడేరులో షాకింగ్ ఘటన జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం నుంచి 20 మంది భక్తులు పాడేరు మొదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్