AP: ఈ నెల 24-28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ నమోదుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్త ఆధార్ నమోదు, పాత వాటిలో వివరాల మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా, రాష్ట్రంలో ఆరేళ్ల లోపు 8.53 లక్షలు మంది, ఆరేళ్లు పైబడిన వారికి సంబంధించి 42.10 లక్షల మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్లో ఉంది.