తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. 20 కోట్ల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్, పాలకమండలి సభ్యులకు శిక్ష తప్పదని పల్లా శ్రీనివాసరావు అన్నారు.