AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చౌడేశ్వరి నగర్కు చెందిన సత్యనారాయణ మృతి చెందడంతో ఈ సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మరణించగా, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది.