AP: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న దానిపై పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, సీబీఐ కూడా కల్తీ జరిగిందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అన్ని దేవాలయాల్లో ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపించారు. లడ్డూ కల్తీపై చర్చించకుండా సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని, టీటీడీలో తప్పులపై గత ఐదేళ్లలో వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.