AP: రాష్ట్ర ప్రజలకు అలర్ట్. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా APSDMA వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం మన్యం, అల్లూరి, కాకినాడ, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.