AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.