AP: భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులు వస్తాయని, వాటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 'తల్లికి వందనం' పథకం కింద అందించే సహాయం తేదీని త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. విజయవాడలో వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని, పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఆయన కూతుళ్లపై అసభ్యకర పోస్టులు పెట్టారని విమర్శించారు. అందరికీ రాజధాని అవసరమని, కానీ 'గొడ్డలి పార్టీకి' అవసరం లేదని అన్నారు.