పెదబయలు మండలంలోని మంగళవారం సాయంత్ర సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాహనచోదకులు పాదచారులు ఆయా వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా మామిడి జీడి మామిడి పిందెలు రాలిపోయాయని పలువురు గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.