చింతూరు గొల్ల బజార్కు చెందిన ఎం.వంశీ కృష్ణ అనే కూలీ మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న అతడు, సంపాదించిన కూలి డబ్బును ఇంటికి ఇవ్వకుండా తాగుడుకు ఖర్చు చేయడంతో భార్యతో గొడవ జరిగింది. ఈ క్షణికావేశంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు.