విశాఖలో గర్భిణీ హత్య కేసు వివరాలను ఏసీపీ అప్పలరాజు వెల్లడించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోజు చేశామని చెప్పారు. భర్త జ్ఞానేశ్వర్ తీరుపై అనూషకు అనుమానం ఉండేదని ఏసీపీ తెలిపారు. ఈ విషయంపైనా జ్ఞానేశ్వర్, అనూషకు తరచూ వాదనలు జరిగేవన్నారు.