చింతపల్లి మండలంలోని చింతపల్లి గ్రామంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోకు మైక్ ఏర్పాటు చేసి బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొని అవసరమైన పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామ అధ్యక్షులు రీమల ఆనందరావు, బి. ఎల్. ఏ. ముత్యం చినబాబు పాల్గొన్నారు.