ఎస్‌ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్‌కు ఆటో ద్వారా మైక్ ప్రచారం

చింతపల్లి మండలంలోని చింతపల్లి గ్రామంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోకు మైక్ ఏర్పాటు చేసి బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొని అవసరమైన పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామ అధ్యక్షులు రీమల ఆనందరావు, బి. ఎల్. ఏ. ముత్యం చినబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్