పాడేరు: గ్యాస్ పైపుల మార్పునకు చర్యలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ పైపులు మార్పులు చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ ఆదివారం తెలిపారు. ఇటీవల ఐవోసీ అధికారులు ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసి ఐదేళ్లు పైబడిన గ్యాస్ పైపులను మార్చాలని, మార్చకపోతే గ్యాస్ పైపులు పగిలిపోయి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారన్నారు. ఈ మేరకు వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ పైపులు మార్చుకోవాలని సూచించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్