పాడేరు: అమరుల త్యాగం ఎన్నటికీ మరువలేం: ఎస్పీ

అమరుల త్యాగం ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పాడేరు కేంద్రీకృత ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం అశ్రునయనాలతో అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పలువురి సేవలను కొనియాడారు. అమరుల త్యాగాలు దేశ రక్షణకు కవచంగా నిలిచాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్