అనకాపల్లి: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్