పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెందుర్తి మండలం గొల్ల నారాయణపురం గ్రామంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన కొత్తవారికి పింఛన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్