వై.రామవరంలో మంగళవారం రాత్రి 300 మంది భక్తులు అగ్నిగుండంలో ప్రవేశించి తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక అమ్మవారి ఆలయం ఎదుట కణకణ మండే నిప్పులగుండంపై భవానీ మాలధారణ చేసిన భక్తులు నడిచారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు.