ముగిసిన ప్రాయశ్చిత్త దీక్ష

అచ్యుతాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మూడు రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ఆదివారం పూర్ణహుతితో ముగిసింది. దీక్ష ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. వైసిపి నాయకులు తిరుపతి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం సరికాదని జరిగిన తప్పును ఒప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్