ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లగ్జరీ RTC బస్సు రోడ్డు దాటుతున్న స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మడక నూకరాజు (35) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఎలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.