AP: అమరావతి రైతులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో సరైన కనెక్టివిటీ లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. రాజధాని పేరుతో భూ కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. డీసెంట్రలైజేషన్ కోసమే విశాఖను రాజధానిగా జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయినా అమరావతికే ప్రభుత్వం మొత్తం నిధులు ఖర్చు చేస్తోందని సజ్జల ఆరోపించారు.