AP: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు అమరావతిలో భాగంగా ఉంటాయని, 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కూడా నిర్మిస్తామని తెలిపారు. విజన్ 2047 లక్ష్యంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని, మూడేళ్లలో రాజధాని ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల సిద్ధాంతంపై ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ ప్రకటన చేశారు.