ఏపీ రాజధాని అమరావతిని విస్తరించేందుకు ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమవుతోండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రభుత్వం నిర్ణయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని, అమరావతి కథ అంతులేని కథలా మారిందని విమర్శించారు. అమరావతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు ఇచ్చారని, మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో అత్యుత్తమ రాజధాని కడతామని సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారని ఆయన ఎద్దేవా చేశారు.