గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రిలో జరిగిన చీరల స్కామ్పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 2018-19 మధ్య అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని గుర్తించారు. ఈ మేరకు ఈవో భ్రమరాంబకు, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యంకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని ఆదేశించింది.