టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 11 అని వ్యాఖ్యానించిన వెంకన్న, "అసెంబ్లీలో పార్టీకి ఉన్న సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు" అని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో మృతుల వివరాలు తెలుసుకోవడానికి, స్కాంలో ఎన్ని కోట్లు దోచుకున్నారో తెలుసుకోడానికి ప్రత్యేక యాప్లు అవసరమే అంటూ విమర్శించారు.