అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 61 ఏళ్ల అందే సత్యవతి అనే మహిళ మృతి చెందింది. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ట్యాంకర్ లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.