ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి దారుణ హత్య

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరం జంక్షన్ వద్ద ఇసుక ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మాడుగుల మండలం వంటర్లపాలెం గ్రామానికి చెందిన శ్రీను (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారస్ ఫార్మా కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీను మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చోడవరం SI జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్