నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఐదు రోడ్ల జంక్షన్లోని ఒక హోటల్ సరఫరా చేసిన టిఫిన్లో బొద్దింక కనిపించిందని వడిగర్ల శ్రీను అనే వ్యక్తి ఆరోపించారు. విశాఖపట్నం నుంచి పని నిమిత్తం నర్సీపట్నం వచ్చిన ఆయన, తనకు అందించిన టిఫిన్లో బొద్దింక ఉందని, ఫుడ్ ఇన్స్పెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన వాస్తవమేనని హోటల్ యజమాని అంగీకరించారు.